జగన్‌కు భారీ బందోబస్తు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్.. ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభ్వుతం…

telangana government provides bullet proof vehicle for ys jagan
- Advertisement -

telangana government provides bullet proof vehicle for ys jagan

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఇటీవల ఆయనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఈ తరహా భద్రతను కల్పించినట్లు తెలుస్తోంది.

భద్రతలో భాగంగా వైఎస్ జగన్‌కు బుల్లెట్ ప్రూప్ వెహికల్‌‌ను తెలంగాణ  ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఆయన ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై దాడి అనంతరం.. జగన్ అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని నేరుగా హైదరాబాద్‌కు వచ్చేశారు. అనంతరం ఇక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

గాయం మానడానికి మరికొద్దిరోజుల సమయం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు వైఎస్ జగన్ తన పాదయాత్రను తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు.  ప్రస్తుతం జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

- Advertisement -