పుల్వామా దాడి: జవాన్ల త్యాగాలు ఎన్నటికీ మరచిపోము: పవన్ కళ్యాణ్

pawan_kalyan react on cfpf pawlama attack
- Advertisement -

అమరావతి: ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తన మ‌న‌సుని క‌లచి వేసిందని, మృతుల సంఖ్య పెరుగుతుండ‌డం బాధ‌ని క‌లిగిస్తుందని, అమరవీరులకు తన తరపున, జనసైనికుల తరపున శాల్యూట్ చేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అవంతిపురా వద్ద జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి కోసం ఉగ్రవాదులు ఏకంగా 320 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ కారు జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది.

దాడిని ఖండిస్తున్న వివిధ దేశాలు..

ఈ ఉగ్ర ఘాతుకంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. రాజ‌కీయాల‌కి అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ఖండించారు. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అండగా ఉంటామ‌ని అమెరికా కూడా తెలిపింది. అయితే ఇంత‌టి దారుణ‌మైన చ‌ర్య‌ని సినిమా సెల‌బ్రిటీలు కూడా ఖండిస్తున్నారు.

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘‘దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవ‌డం మ‌న‌సుని క‌లచి వేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండ‌డం బాధ‌ని క‌లిగిస్తుంది. అమరవీరులకు నా తరపున, జనసైనికుల తరపున శాల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘మ‌న‌ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న జ‌వాన్లు ఉగ్రదాడిలో మ‌ర‌ణించడం మ‌న‌సుని క‌లచి వేసింది. ప్రాణాలు విడిచిన జ‌వాన్ల కుటుంబాల‌కి అండ‌గా నిల‌బ‌డ‌డం మ‌న ధ్యేయం..’’  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సైనికుల‌పై జ‌రిగిన భీక‌ర దాడి ఇంకా న‌మ్మ‌శక్యంగా లేదు. ఈ ఘ‌ట‌న‌ని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేము అంటూ చెప్పాడు.

 

చదవండి : పాకిస్తాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరించిన భారత్, తక్షణమే అమల్లోకి… 

- Advertisement -