జగన్‌పై పథకం ప్రకారమే దాడి.. నిందితుడి జేబులో లెటర్‌: ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌

PR PTHAKUR
- Advertisement -

sirPR PTHAKUR

విశాఖపట్నం : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఏపీ పోలీసులు స్పందించారు. వైఎస్‌ జగన్‌ దగ్గరకు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ దుండగుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని, పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ప్రకటించారు.

చదవండి: షాకింగ్: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…

సీఐఎస్‌ఎఫ్‌ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే చేశాడా? లేదా ఈ దాడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారిస్తామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని డీజీపీ ఠాకూర్‌ చెప్పారు. అలాగే అసలు ఎయిర్‌పోర్టులోకి కత్తితో నిందితుడు ఎలా ప్రవేశించాడనే అంశంపైనా విచారిస్తున్నామని తెలిపారు.

మరోవైపు వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ దగ్గర ఎనిమిది పేజీల లెటర్‌ను కూడా కనుగొన్నామని  దాన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తమకు అందించారని డీజీపీ తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -