ఢిల్లీ: మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన రూ.200 నోటులో మరిన్ని మార్పులు చేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 23న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది ఆర్బీఐ.
ఇప్పటికే చలామణిలో ఉన్న రూ.200 నోటు లాగే కొత్తగా రిలీజ్ చేయబోయే నోటు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కొత్త నోటుపైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. రూ.200 నోటు మాత్రమే కాదు… రూ.500 నోట్లు కూడా శక్తికాంత దాస్ సంతకంతో రానున్నాయి.
2017 ఆగస్ట్ 25న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో రూ.200 విలువైన కరెన్సీని విడుదల చేసింది. అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉర్జీత్ పటేల్ ఉన్నారు. ఆయన సంతకంతో రూ.200 నోట్లు విడుదలయ్యాయి. ఇటీవల ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు.
ఆయన వచ్చిన తర్వాత రూ.200 నోట్లు రిలీజ్ చేయలేదు ఆర్బీఐ. త్వరలో శక్తికాంత దాస్ సంతకంతో రూ.200 నోటుతో పాటు రూ.500 నోట్లను ఆర్బీఐ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో రూ.50 విలువ గల నోట్లు విడుదలయ్యాయి.