బిగ్‌బాస్-3 పార్టిసిపెంట్‌గా యాంకర్ ఉదయభాను.. కళ్లు చెదిరే పారితోషికం!

- Advertisement -

హైదరాబాద్: స్టార్‌మా చానల్‌లో ప్రసారమైన ‘బిగ్‌బాస్’ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సీజన్-1కి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో షోకి ఎక్కడ లేని ఆదరణ వచ్చింది. ఆ తర్వాత సీజన్‌కు మరో నటుడు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. తొలుత నెగటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో చేసి షోను రక్తికట్టించాడు.

అయితే, పార్టిసిపెంట్స్ విషయంలో కొన్ని విమర్శలు రావడంతో బిగ్‌బాస్-3 సీజన్ విషయంలో నిర్వాహకులు ఎక్కడ లేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పార్టిసిపెంట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్వాహకులు ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు.

తాజాగా, బయటకు వచ్చిన సమాచారం ప్రకారం సీనియర్ యాంకర్, నటి ఉదయభానును ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు కూడా సమాచారం. ఎలిమినేషన్ వరకు రోజుకు రెండు లక్షల రూపాయల ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు, ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం కూడా ఆమెకేనని తెలుస్తోంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

- Advertisement -