పశ్చిమగోదావరి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లకు ఓటెయొద్దని.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని దోచుకుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్, పవన్పై విరుచుకుపడ్డారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని.. దమ్ముంటే పవన్ కళ్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్కు డ్యాన్స్ కూడా రాదంటూ..
బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలు పార్టీలా అని ప్రశ్నించారు. ‘మా పార్టీకి హెలికాప్టర్ గుర్తు రాకుండా అడ్డుకునేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. మాటలు కూడా రాని తన కొడుక్కి చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు’ అని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి ఓ మల్టీ స్పెషల్ ఆస్పత్రి కట్టిస్తానని హామీ ఇచ్చారు పాల్. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పోల్చితే పవన్ కళ్యాణ్కు డ్యాన్స్ చేయడం కూడా రాదని కేఏ పాల్ విమర్శించారు. అంతేగాక, ఆయనే డ్యాన్స్ చేసి చూపించడం అక్కడిని వారిని ఆకట్టుకుంది.
Paul unkul dance
Inviting pk for alliance.https://t.co/GuC5blYInv— Kiran (@kirankonnects) March 21, 2019