పాట్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్పై బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లాలును కలిసిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీని జేడీయూలో విలీనం చేయాలని ప్రతిపాదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన నోటి నుంచి ఆ మాట రాగానే తనకు ఎక్కడలేని కోపం వచ్చిందని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రశాంత్ కిశోర్ను ఆదేశించానని పేర్కొన్నారు.
నితీశ్ కుమార్ చేసిన నమ్మక ద్రోహాన్ని ఇంకా మర్చిపోలేదని, ఆయనపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.
ప్రశాంత్ కిశోర్ చాలాసార్లు తమను కలిశారని, తేజస్వీయాదవ్ బంగ్లాతోపాటు తమ నివాసానికి కూడా వచ్చారని రబ్రీదేవి పేర్కొన్నారు. కనీసం ఐదుసార్లు వచ్చారని రబ్రీ తెలిపారు. ఈ విషయం తమ సిబ్బందితోపాటు సెక్యూరిటీకి కూడా తెలుసన్నారు. ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయాలన్న ప్రతిపాదనతో నితీశ్ కుమారే ప్రశాంత్ను తమ వద్దకు పంపారని రబ్రీదేవి ఆరోపించారు.
చదవండి: రిటర్న్ గిఫ్ట్ పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!