రాజ్కోట్: భారత్ మరోసారి దుమ్ము రేపింది. తొలి టెస్టులో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కోహ్లీ సేన స్వదేశంలో ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఇన్నింగ్స్ తేడాతోనే విజయాలు సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ భారత్కు వెస్టీండీస్ అసలు పోటినే ఇవ్వలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోను చేతులెత్తేసింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 649/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 180 అలౌట్ అయి ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్(5/55) రవీంద్ర జడేజా (3/35) చేలరేగడంతో ఫాలోఆన్లోను 196 పరుగులకే ఆలౌటైంది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్83 (93 బంతుల) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.
యువ క్రికెటర్ పృథ్వీషాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక రెండో టెస్ట్