గుంటూరు: 74 ఏళ్ల వయసులో తల్లి అయి రికార్డు సృష్టించిన మంగాయమ్మ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
పెళ్లై 57 ఏళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో మంగాయమ్మ దంపతులు చాలా బాధపడ్డారు. తెలిసినవారి ద్వారా సరోగసి చేయించుకుని ముసలివయసులో తల్లిదండ్రులు అయ్యారు.
ఇద్దరు కవలలు (ఆడపిల్లలు) జన్మిచ్చిన మంగాయమ్మ అందరినీ ఆశ్చర్యపరిచారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఆమెకు ఇటీవలే వైద్యులు కాన్పు చేశారు.
అప్పట్లో క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మంగాయమ్మ తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చివ్వడం వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తాయి.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త ఎర్రమట్టి రాజారావు కూడా హార్ట్ఎటాక్తో ఆస్పత్రిలో చేరారు. దీంతో వీరి కుటుంబసభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.
కవలపిల్లల పుట్టుక సందర్భంగా మంగాయమ్మ మూడు గంటలపాటు తీవ్రమైన నొప్పులు అనుభవించిందని, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించవలసివచ్చిందని డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు.
ఆమె భర్త రాజారావు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. హఠాత్తుగా తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆయన తట్టుకోలేక గుండెపోటుకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు.