బ్లాక్‌మెయిలర్ హరీశ్! నిజాయితీ గల నేత కేటీఆర్: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

jagga reddy
- Advertisement -

jagga reddy

హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే, మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్ రావుపై మాత్రం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.

కేసీఆర్ వల్ల రెండు సార్లు మంచి జరిగింది: జగ్గారెడ్డి

సోమవారం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనకు కేసీఆర్ కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై తాను రాజకీయ విమర్శలే చేశాను తప్ప.. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. అంతేగాక, కేసీఆర్ వల్ల తనకు రెండు సార్లు మంచి జరిగిందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తొలిసారి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యానని చెప్పిన జగ్గారెడ్డి.. తనను జైల్లో పెట్టినప్పుడు తన కుమార్తెను తెరపైకి తెచ్చినట్లు చెప్పారు.

అయితే, తనకు హరీశ్ రావుతో మాత్రం విభేదాలున్నాయని అన్నారు. తనను జైల్లో పెట్టించింది హరీశ్ రావేనని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీశ్‌వి బ్లాక్ మెయిల్ రాజకీయాలని విమర్శించారు. కేటీఆర్ మాత్రం నిజాయితీగల నాయకుడని జగ్గారెడ్డి ప్రశంసించారు.

చదవండి: 13 ఏళ్ల తర్వాత కేసీఆర్‌తో మాట్లాడా: జగ్గారెడ్డి, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు

లాబీయింగ్ చేసే వాళ్లకే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని, తనలాంటి వారికి లాబీయింగ్ చేసేవాళ్లు లేరని జగ్గారెడ్డి చెప్పారు. ఇబ్బంది పడుతున్న నాయకులకు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 75శాతం మంది నేతలు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారని అన్నారు.

- Advertisement -