2018-19లో టీడీపీకి వచ్చిన విరాళాలు ఎన్ని కోట్లో తెలుసా?

- Advertisement -

అమరావతి: 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 26.17 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ మేరకు రూ.20 వేలు, ఆపైన అందిన విరాళాల నివేదిక అందించారు.

ఈ మొత్తం విరాళాల్లో ఒక్క ఫ్రూడెంట్ ఎన్నికల ట్రస్టే రూ.25 కోట్లు ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు. అప్పటి టీడీపీ నేతలు, ప్రస్తుత వైసీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామ కృష్టంరాజు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు, సీనియర్‌ నేత వేగేశన నరేంద్రవర్మ రాజు రూ.5 లక్షలు చొప్పున విరాళాలు ఇచ్చినట్టు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న అప్పటి టీడీపీ నేతలు షేక్‌ నూర్‌జాన్‌ రూ.4.20 లక్షలు, టీడీపీ నేతలు కొండూరు అశోక రాజు, దేవినేని అవినాశ్‌ రూ.3 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే యామినీబాల, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు లక్ష రూపాయల చొప్పున విరాళం అందించారు. ప్రస్తుత వైసీపీ నేత బుట్టా రేణుకకు చెందిన బుట్టా ఫౌండేషన్‌ రూ.లక్ష చొప్పున విరాళం అందించింది.

- Advertisement -